16, మే 2012, బుధవారం

మన శాస్త్రవేత్తలు-9 (ఆర్యభట్టు)


 



ఆర్యభట్టు భారతదేశ అత్యున్నత గణిత, ఖగోళ  శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను క్రీ.శ. 476-550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఆర్యభట్టు కుసుమపురము (ఈనాటి పాట్నా) లో నివసించాడు. ఇతను ఆర్యభటీయం, ఆర్య సిధ్ధాంతం, గోళాధ్యాయం మరియు సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు. ఇవే కాక ఆర్యభట్టు పై విలువను సుమారుగా కనుకున్నట్లు చెప్తారు. గణితం లో మనం నేర్చుకున్న సైన్ మరియు కొసైన్ లను ఇతను "జ్యా" మరియు      "కొ జ్యా" గా నిర్వచించాడు.

భూమి నీడ చంద్రుని మీద పడడం వల్లే గ్రహణాలు వస్తాయని, రాహు కేతువులు అనేవి నిజంగా లేవని వాదించాడు కానీ అతని వాదనని అప్పట్లో ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు కూడా కొంత మంది గ్రహణం సమయంలో భోజనం చెయ్యరు, గర్భిణి స్త్రీలని ఇంటి బయటికి రానివ్వరు. ఆర్య భట్ట బోధనలు గ్రీక్ శాస్త్రవేత్తలని కూడా ప్రభావితం చేసాయి. భూమి నీడ చంద్రుని మీద గోళాకారం(elliptical shape)లో పదుతుంది కనుక భూమి గుండ్రంగా ఉన్నట్టు గ్రీక్ శాస్త్రవేత్తలు కనిపెట్టింది ఆర్య భట్ట సిధ్ధంతాల ఆధారంగానే. కానీ అప్పట్లో ప్రజలలో ఈ సిధ్ధాంతాలని నమ్మేంత జ్ఞానం వృధ్ధి చెందలేదు.

ప్రపంచంలో చాలా మంది ప్రముఖ గణిత శాస్త్రవేత్తల కష్టాలకు కారణమైన భూమి యొక్క ఆకారాన్ని గోళాకారంగా ఆనాడే తన గోళాధ్యాయం లో నిర్వచించాడు.  అంతేకాదు మన గ్రహాల యొక్క ప్రకాశం స్వయంప్రకాశం కానే కాదని, అది కేవలం సూర్యకాంతి పరివర్తన వలన వచ్చినదని చెప్పాడు. సూర్య గ్రహణాల ను ఖచ్చితంగా లెక్క కట్టాడు.
భూమి తన చుట్టూ తాను తిరగటానికి (పరిభ్రమణం) పట్టే సమయం 23 గంటల, 56 నిమిషాల, 4.1 సెకనులు గా లెక్కగట్టాడు. ఈనాటి ఆధునిక లెక్కల ప్రకారం అది 23 గంటల, 56 నిమిషాల, 4.091 గా తేలింది.
భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఇతని పేరు (
ఆర్యభట్టు ) పెట్టారు.


ఆర్యభట్టు యొక్క జన్మ సంవత్సరం ఆర్యభట్టీయంలో స్పష్టంగా ఉదహరించబడింది కానీ ఈయన పుట్టిన ప్రదేశం యొక్క ఉనికి గురించి మాత్రం పండితులలో ఏకాభిప్రాయం లేదు. కొంతమంది పండితులు ఆర్యభట్టు నర్మాద, గోదావరి మధ్య ప్రాంతమైన అస్మకలో పుట్టాడని నమ్ముతారు. వీరి దృష్టిలో అస్మక మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ లో భాగమైన మధ్య భారతదేశం. తొలి బౌద్ధ గ్రంథాలు అస్మక మరింత దక్షిణాన ఉన్న దక్కన్ ప్రాంతమని వర్ణిస్తున్నాయి. అయితే ఇతర గ్రంథాలు అస్మక ప్రజలు అలెగ్జాండర్ పై పోరాడారని ప్రస్తావిస్తున్నవి. అదే నిజమైతే అస్మక మరింత ఉత్తరాన ఉండి ఉండాలి.

7, మే 2012, సోమవారం

మన శాస్త్రవేత్తలు -8 (ఆంటోని ల్యూవెన్‌ హక్‌)


ఆంటోని ల్యూవెన్‌ హక్‌

Antony van Leeuwenhoek (1632-1723)

(అక్టోబరు 24, 1632)




 . . my work, which I've done for a long time, was not pursued in order to gain the praise I now enjoy, but chiefly from a craving after knowledge, which I notice resides in me more than in most other men. And therewithal, whenever I found out anything remarkable, I have thought it my duty to put down my discovery on paper, so that all ingenious people might be informed thereof.
Antony van Leeuwenhoek. Letter of June 12, 1716

సూక్ష్మలోకం చూపించినవాడు! బుట్టలల్లి జీవించే కుటుంబంలో పుట్టాడు... చదువుసంధ్యలు పెద్దగా లేవు... చిన్న వ్యాపారంతో ఉపాధి మొదలెట్టాడు... అలాంటి వ్యక్తి శాస్త్రవేత్త అయి అంతవరకూ తెలియని  లోకాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తాడని వూహించగలమా? అతడే - ఆంటోనీ ల్యూవెన్‌ హోక్‌. 'మైక్రోస్కోప్‌'ను కనిపెట్టినవాడు.
Description: https://sites.google.com/site/seshagirirao2006/_/rsrc/1287994948478/home/antony-van-leeuwenhoek-antoni-lyuven-hok/Antony%20van%20Leeuwenhoek.jpg
హాలెండ్‌లోని డెఫ్ట్‌లో 1632 అక్టోబరు 24న బుట్టలు అల్లుకుని జీవించే కుటుంబంలో పుట్టిన ఆంటోనీ చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. కుటుంబంతో ఆమ్‌స్టర్‌డామ్‌ నగరానికి వెళ్లిన అతడు ఓ బట్టల దుకాణంలో గుమాస్తాగా చేరాడు. వివాహానంతరం డెఫ్ట్‌ తిరిగి వచ్చి స్వంతంగా చిన్న బట్టల దుకాణాన్ని 
ప్రారంభించాడు. ఆరోజుల్లో ఉండే భూతద్దాల పట్ల ఆకర్షితుడై రకరకాల కటకాల తయారీలో ప్రయోగాలు చేసేవాడు. అలా సున్నితమైన కటకాలను రూపొందించి ఒక స్టాండుకు బిగించి మొట్టమొదటి సరళ సూక్ష్మదర్శిని (simple microscope)ని తయారు చేయగలిగాడు.
కంటికి కనిపించని వాటిని కూడా చూపించే సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్‌) ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జీవ శాస్త్ర పరిశోధనలు, వైద్యరంగంలో రోగనిర్దారణ పరీక్షలు సహా అనేక రకాలుగా ఉపయోగపడుతున్న ఈ పరికరాన్ని కనిపెట్టడం ద్వారా 'మైక్రో బయాలజీ' అనే కొత్త శాస్త్ర అధ్యాయానికి తెర తీసిన వ్యక్తిగా ఆంటోనీ ల్యూవెన్‌ హోక్‌ పేరొందాడు. స్వయంగా తయారు చేసుకున్న మైక్రోస్కోపుల సాయంతో ప్రపంచంలోనే తొలిసారిగా ఏకకణ జీవుల్ని, సూక్ష్మజీవుల్ని, చర్మ నిర్మాణం, రక్తనాళికల్లో రక్త ప్రవాహం సహా అనేకదృశ్యాలను చూడగలిగాడు.


ఆ మైక్రోస్కోపుతో అన్నింటినీ పరిశీలించడమే అతడి పనిగా మారింది. ఒక దశల ఇరుగుపొరుగువారు అతడిని పిచ్చివాడిగా జమకట్టారు. ఆ పరిశీలనల వల్ల అతడు చర్మంపై స్వేదగ్రంథులను, జంతువుల కళ్లను, వెంట్రుకలను, కీటకాల నోటి భాగాలను ఇలా ఎన్నో గమనించి నోట్స్‌ రాసుకున్నాడు. మురికి నీటిలో సూక్ష్మజీవుల్ని తొలిసారిగా చూసి, వాటి జీవన విధానాన్ని పరిశీలించాడు. తన వేలిని సూదితో గుచ్చుకుని రక్తాన్ని పరిశీలించి రక్తకణాలను చూడగలిగాడు. ఈ పరిశీలనలను లండన్‌లోని రాయల్‌ సొసైటీకి పంపేవాడు. మొదట్లో నమ్మని అక్కడి శాస్త్రవేత్తలు ఆ తర్వాత అతడి పరిశోధనలు ఎంత విలువైనవో గ్రహించారు. అతడిని 'ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటీ'గా గుర్తించారు. ఇతడిని కలుసుకోడానికి రష్యా పాలకుడు పీటర్‌ ది గ్రేట్‌, బ్రిటన్‌ రాణివంటి ప్రముఖులు వచ్చి మైక్రోస్కోపు చూసి ఆశ్చర్యపడేవారు.

ఆంటోనీ సరళ సూక్ష్మదర్శిని తర్వాత సంయుక్త సూక్ష్మదర్శిని (compound microscope)గా రూపాంతరం చెందింది. దాని ద్వారా సూక్ష్మ జీవుల్ని 2500 రెట్లు పెద్దవిగా చూడగలిగారు. ఇప్పుడు లక్షరెట్లు పెద్దవిగా చూపించే ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపులు ఉన్నాయి.

5, మే 2012, శనివారం

థామస్‌ ఆల్వా ఎడిసన్‌


థామస్‌ ఆల్వా ఎడిసన్
(ఫిబ్రవరి 11, 1847 – అక్టోబర్ 18, 1931)  
                                        

ఫిబ్రవరి 11, 1847న అమెరికాలో జన్మించిన థామస్‌ ఆల్వా ఎడిసన్‌ తల్లిదండ్రులు డచ్‌, స్కాట్లాండ్‌ కు చెందినవారు. ఎడిసన్ అమెరికా లోని ఓహియో రాష్ట్రానికి చెందిన మిలన్ అనే ప్రాంతంలో జన్మించి మిషిగాన్ రాష్ట్రంలోని పోర్టుహ్యురాన్ అనే ప్రదేశంలో పెరిగాడు. తండ్రి శామ్యూల్ ఆగ్డెన్ ఎడిసన్ జూనియర్ మరియు తల్లి నాన్సీ మాథ్యూస్ ఎడిసన్ లకు ఏడవ మరియు చివరి సంతానం. 16 ఏళ్ళకే టెలిగ్రాఫ్‌ ఆపరే టర్‌ అయ్యాడు. ఆటోమేటిక్‌ టెలిగ్రాఫ్‌ కోసం ట్రాన్స్‌మీటర్‌, రిసీవర్లను కనిపెట్టడం ఆయన మొదటి ఆవిష్కరణ.
డిసెంబర్ 25, 187124 సంవత్సరాల వయసులోఎడిసన్16 యేళ్ళ మారీ స్టిల్ వెల్ ను 
వివాహమాడాడు. వీరికి ముగ్గురు సంతానం మరియన్ ఎడిసన్ ,థామస్ అల్వా  ఎడిసన్   జూనియర్ ,  విలియం లెస్ల్య ఎడిసన్.
                         ఎడిసన్ మొదటగా న్యూజెర్సీ లోని నెవార్క్ లో పరిశోధకుడిగా తన ప్రస్థానాన్ని ఆరంభించాడు. ఆయన మొదట పని చేసినవి ఆటోమాటిక్ రిపీటర్ మరియు టెలిగ్రాఫిక్ పరికరాలు కానీ అతనికి పేరు తెచ్చి పెట్టినది మాత్రం 1877 లో కనిపెట్టబడిన ఫోనోగ్రాఫ్. ఈ పరికరాన్ని కనిపెట్టినపుడు ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆయనకు మెన్లో పార్క్ మాంత్రికుడు అనే పేరు పెట్టారు.1877లో ఫోనోగ్రాఫ్‌ను కనుగొన్నాడు. 40 గంటలపాటు పనిచేసే కా ర్బనైజ్‌డ్‌ కార్బన్‌ త్రెడ్‌ ఫిలమెంట్‌ను తయారు చేసి 1879 అక్టోబర్‌ 21న ప్రయోగాత్మకంగా ప్రదర్శించాడు.థామస్ అల్వా ఎడిసన్  మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త.

1882
లో న్యూయార్క్‌లో విద్యుత్‌ స్టేషన్‌ను స్థాపించాడు. కైనెటోస్కోప్‌ ప్రాసెస్‌ ద్వారా 1890లో మోషన్‌ పిక్చర్స్‌ను తీయడం మొదలుపెట్టాడు. మైనింగ్‌, బ్యాటరీ, రబ్బర్‌, సిమెంట్‌ రక్షణోత్పత్తులు-మన జీవి తంలో భాగమైపోయిన ఎన్నింటికో ఎడిసన్‌ ఆద్యుడు. ఆయన ఆవిష్కరణలు సమాజం రూపురేఖలనే మార్చివేశాయి. ఆవిరి యంత్ర దశ నుండి విద్యుత్‌కాంతుల్లోకి నాగరికత ప యనించడానికి ఆయన పరిశోధనలే కారణం. 1300 ఆవిష్కరణలపై పేటెంట్‌ హక్కులు పొందాడు. ఆయన అంత్యక్రియల రోజు ఆయన గౌరవార్ధం అమెరికా ప్రజలు తమ గృహాల్లో లైట్లను ఆర్పివేసి నివాళి అర్పించారు.